ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న విడుదలైంది.
టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు ఆరేళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాతో ఒక కమర్షియల్ హిట్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వారు వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ కు మెగాస్టార్ డబ్బులిస్తేనే వస్తానన్నాడని నెట్టింట ఓ టాక్ నడుస్తోంది.
అందుకు కారణం లేకపోలేదు.. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు `త్వరలోనే భారీ లెవెల్ లో సక్సెస్ మీట్ జరపబోతున్నాం సార్` అని చిరుతో తెలిపారు. దాంతో చిరు వెంటనే.. `ఇంకా ఎన్ని సార్లు మాట్లాడిస్తారు నాతోటి..నేను తక్కువ మాట్లాడినాన ఏంటి..చాలు చాలు మీరిచ్చిన డబ్బులకు ఈమాత్రం మాట్లాడడమే ఎక్కువ..ఇదేమి బాలేదు. ఒక్క పర్సు ఇచ్చి అన్నీ కావాలంటే కుదరదు’ అంటూ ఉత్తరాంధ్ర స్లాంగ్ లో చిరంజీవి మాట్లాడాడు. అయితే అప్పుడు ఆయన సరదాగానే మాట్లాడినా.. ఇప్పుడు నెట్టింట మాత్రం చిరుకి మైత్రీ వారు అదనపు డబ్బులిచ్చి సక్సెస్ మీట్ కు తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది.