నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలు పెట్టిన తన దండయాత్ర వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాలయ్య కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
అనిల్ సినిమా తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. బింబిసారా సినిమా చూసినప్పుడే బాలయ్య వశిష్ట కు ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలు కాకుండా బోయపాటితో కూడా మరోసారి సినిమా చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. అది అఖండ2 లేదా మరో కొత్త కథతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇవే కాకుండా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. ఇక దీంతో బాలయ్య దూకుడు చూసి యువ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాతో ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య.. తన తర్వాత సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వరుస క్రేజీ కాంబినేషన్స్ తో అదరగొడుతున్నాడు. ఇక దీంతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ పై మరోసారి సునామీ సృష్టిస్తాడని చెప్పవచ్చు.