రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో అశలు పెట్టుకున్నాడు డార్లింగ్. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.

ప్రశాంత్ నీల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేజీయఫ్‌ 1, 2 విజయాల తర్వాత ప్రశాంత్‌ నీల్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. దాంతో, సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్లు రూపొందించిన డిజైన్ చేసిన యాక్షన్స్ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.

ఇకపోతే ఇదే షెడ్యూల్ లో ప్రభాస్‌తో పాటు విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా వుంటాయని, ప్రభాస్ అయితే ఇరగదీస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.