కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్… తన కొత్త ఇంటిని అందుకోసమే కడుతున్నారా…!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయారన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణమట. వాటి వలన వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి వీరిద్దరూ వేరువేరుగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ క్రమంలోనే… వీరిద్దరూ మళ్లీ కలిసిపోయినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

వారి పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ధనుష్- ఐశ్వర్యలను ఒకటి చేయాలని సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే రజినీకాంత్ ధనుష్ ని ఐశ్వర్య ని ఇంటికి పిలిపించుకొని మరి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిచినట్టు తెలుస్తుంది. అయితే ధనుష్ -ఐశ్వర్య మాత్రం మళ్లీ కలిసే అంశంపై ఇప్పటివరకు వాళ్ళు ఏ ప్రకటన చేయలేదు.

Dhanush and Aishwarya: రూ.100 కోట్లతో ఇల్లు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న ధనుష్, ఐశ్వర్య?

ఈ సందర్భంలోనే వచ్చే కొత్త సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని కోసమే ధనుష్ 100 కోట్ల భారీ వ్యయంతో కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. చెన్నై లోని పోయన్ గార్డెన్స్ లో ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది.. వచ్చే సంవత్సరం ధనుష్-ఐశ్వర్యాలు కలిసి ఈ ఇంటి గృహప్రవేశం చేయాలని ఈ జంట భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త ఇంట్లోనే తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారిద్దరు కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని ధనుష్ -ఐశ్వర్య కలిసి చెప్పే అవకాశం ఉందని వారి సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.