పూరి జగన్నాథ్ తర్వాత సినిమా ఆ హీరోతో నేనా…లైవ్ లోనే గూస్ బంప్స్ అప్ డేట్..!!

ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ ఎందుకు తీశారు రా బాబు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.ఈ సినిమాతో పూరి కెరియర్ బాగా డామేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పూరి బయట కనిపించటలేదు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక కీలకపాత్రలో నటించాడు. పూరి క్యారెక్టర్ కూడా సినిమాకు హిట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడింది. సినిమాలో పూరి జర్నలిస్ట్‌ గోవర్ధన్ గా నటించాడు.

రాత్రి గం.8:30లకు లైవ్ లో పూరీజ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తో చిరంజీవి ( Chiranjeevi) ఇంటర్వ్యూ..!

గాడ్ ఫాదర్ సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. సక్సెస్ మీట్ లో కూడా పూరి కనిపించలేదు. దీంతో పూరీకి ఏమైంది? గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కి ఎందుకు రాలేదు? అన్న విషయం టాలీవుడ్ లో హాట్‌టాపిక్ గా మారింది. ఈ సందేహాలు అన్నిటికీ ముగింపు చెప్పే విధంగా పూరి జగన్నాథ్ తన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలోనే చిరంజీవి పూరీ మధ్య పలు ఆసక్తికరమైన సంఘటనలు గురించి కూడా చర్చలు వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆ ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో చిరంజీవి- పూరి జగన్నాథ్ మధ్య వాళ్ళ తర్వాత సినిమాలపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. మెగాస్టార్ రీఎంట్రీ సినిమాగా ఆటో జానీ మూవీ తీయాలనుకున్నాడు. కానీ ఆ సినిమాకు కొన్ని అనుకోని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ చర్చలో పూరి- చిరంజీవితో తను చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ఒక హింట్ ఇచ్చాడు. ఆ సినిమా తాను తీసిన పాత సినిమాలు లా కాకుండా అభిమానులు కోరుకునే విధంగా తెరకెక్కిస్తారని పూరి చిరంజీవితో అన్నాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.