బిగ్ షాకింగ్: కన్నింగ్ కొరటాల వల్ల ఎన్టీఆర్ 100 కోట్లు నష్టపోయాడా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!

స్టార్ హీరోలకు సినిమా హిట్ అయింది అంటే వారి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సూపర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. దాంతో ఆయన తర్వాత సినిమాకు ఏకంగా 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ కూడా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత తారక్ తన సినిమా షూటింగ్ మొదలు పెట్టుంటే ..ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగేది.

కానీ ఎన్టీఆర్ కి ఆ ఛాన్స్ రాలేదు. మనకు తెలిసిందే తారక్ తన తర్వాత సినిమాని డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా విడుదల 8 నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్- కొరటాల సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం మొదలు పెడతారా లేదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ సంవత్సరం ఎన్టీఆర్- కొరటాల సినిమా ప్రారంభం అవ్వకపోతే 2023వ సంవత్సరంలో ఎన్టీఆర్ ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం లేదు. ఎన్టీఆర్‌ను థియేటర్లో చూడటానికి మళ్లీ 2024 దాకా వెయిట్ చేయాల్సిందే. అయితే దీంతో ఎన్టీఆర్ కు ఫైనాన్షియల్ గా కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయని కూడా సినీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.

ఏ సినిమా అయినా అనుకున్న టైం కు మొదలు కాకపోతే సినిమా షూటింగ్ లేట్ అయ్యే కొద్ది బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో రెమ్యూనరేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే సినిమా మొదలుపెట్టి ఉంటే మొత్తంగా తను 50 నుండి 60 కోట్లరూపాయల రెమ్యూనరేషన్ అతనికి అందేది. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టేయవచ్చు.. అప్పుడు రెండు సినిమాలను ఒకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగేది. ఇప్పటికీ కూడా కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగానే ఉన్నాడు. దీనివల్ల ఎన్టీఆర్ ఈ సంవత్సరం తన ఫైనాన్షియల్ గా 100 కోట్లు నష్టపోయారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరటాల ఈ సినిమా ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిదని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి కొరటాల ఏం చేస్తాడో..?