పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్సాబ్, ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. ఈ రెండూ రీమేక్ సినిమాలే. ఇక భీమ్లానాయక్ సినిమా మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్గా రాగా పవన్, దగ్గుబాటి రానా కలిసి నటించారు. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి చేసిన మల్టీస్టారర్ కావడంతో భీమ్లానాయక్పై రిలీజ్కు ముందే మంచి హైప్ వచ్చింది.
సినిమా సూపర్ హిట్ అయ్యింది.. పవన్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్పై ప్రశంసలు కురిశాయి. అయితే ఈ రీమేక్ సినిమాకు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో ఈ రోజు షాకింగ్ సీక్రెట్ రివీల్ అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్లో రివీల్ చేశారు. ఈ షోలో బాలయ్య భీమ్లానాయక్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఎవరు అన్న ప్రశ్న వేశాడు.
వెంటనే నిర్మాత నాగవంశీ సార్ మీరే ఫస్ట్ ఛాయిస్.. మేం ఈ సినిమా చేయమని మీ చుట్టూ చాలాసార్లు తిరిగాము… మీరు సినిమా చూసి… ఈ కథకు పవన్ కళ్యాణ్ గారు అయితే బెటర్ ఛాయిస్.. ఆయన చేస్తేనే బాగుంటుందని మీరే కదా సజెస్ట్ చేశారని సమాధానం ఇచ్చారు. వాస్తవంగా కూడా ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకునే టైంలో బాలయ్య పేరు వినిపించిన మాట నిజమే..!
ఇక ఇప్పుడు ఆ న్యూస్ నిజమే అని నిర్మాత నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్య సలహాతోనే సితారా బ్యానర్ పవన్ కళ్యాణ్ను అప్రోచ్ అయ్యిందట. ఇక ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చాక బాలయ్య అభిమానులు ఈ సినిమాలో బాలయ్య చేసి ఉంటే ఆ మాస్ గెటప్, మాస్ డైలాగులతో సినిమా రేంజ్ మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా బాలయ్య సజెషన్తో పవన్ ఖాతాలో మంచి హిట్ పడింది.