‘మెగా 154’ పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఇక అంతే!?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీర‌య్య‌’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా యూనిట్ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఈ సినిమాలో రవితేజ దాదాపుగా 35% రన్ టైం లో స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు సినిమా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసిన రవితేజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. ఓ పక్క మెగా ఫాన్స్ మాత్రం బ్యాడ్ సెంటిమెంట్ అంటూ వారి నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

గతంలో `ఆచార్య` సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. దానికి కారణం సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కాస్త ఎక్కువగానే కనిపించారు. కాబట్టి ఇంచుమించుగా ‘వాల్తేరు వీర‌య్య‌’ సినిమాలో కూడా ఆచార్యలో రామ్ చరణ్ ఎంత సమయం కనిపించాడో రవితేజ కూడా అంతే సమయం కనిపించ‌బోతున్నాడ‌నీ కన్ఫర్మ్ అయింది. కాబట్టి చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో నటించడం అనేది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా మెగా ఫాన్స్ ఫీలవుతున్నారు.

 

మరికొంతమంది `గాడ్ ఫాదర్` ను మించిన సక్సెస్ ను ఈ సినిమా అందుకుంటుందని పైగా ఆచార్య సినిమాకు ఈ సినిమాకు అసలు సంబంధం లేదని నమ్ముతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ను రివిల్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి 154వ సినిమాపై ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక మంచి సక్సెస్ను అందుకుంటుందా? అని కొంతకాలం వేచి చూడాల్సిందే.