చిరంజీవి-ఫోన్ చేయడంతో ఆల్ ఈజ్ వెల్ అంటున్న మోహన్ బాబు..?

టాలీవుడ్ లో మా ఎన్నికలు జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మోహన్ బాబు మెగా ఫ్యామిలీ ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి మోహన్ బాబు కు ఫోన్ చేసినారు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఇక చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేసి మా ఎలక్షన్లలో ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. కానీ ఆ కారణంగా తన పేరు బయటకు వచ్చిందని చిరంజీవి తెలియజేశాడు. ఎప్పటిలాగే అందరం కలిసికట్టుగా పని చేసుకుందాం అంటు మోహన్ బాబుతో స్నేహబంధం కొనసాగుతుందన్న చిరంజీవి. ఈ విషయంపై స్నేహపూర్వకంగా ని స్పందించిన మోహన్ బాబు.

అయితే వీరిద్దరిపై ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేయడంతో ఈ విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీలో ఉండే నటులు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని కాబట్టే.. కలిసిపోయారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అందరూ కలిసి ఉంటేనే ఏ పనైనా సాధ్యమవుతుందని ఉద్దేశంతోనే కలిసిపోయారని సమాచారం.