ప్రభాస్ మూవీ బిగ్ అప్డేట్ ..ఫ్యాన్స్ ఖుషి !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

అయితే క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్తి అయింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. అంతేకాదు, మ‌రో మూడు రోజుల్లో ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రాబోతోంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

మ‌రి ఆ బిగ్ అప్డేట్ ఏంటో తెలియాలంటే.. మూడు రోజులు ఆగాల్సిందే. కాగా, అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగి ఉంటే.. రేపే(జూలై 30) ఈ చిత్రం విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చి అన్నిటినీ తారుమారు చేసేసింది.