టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్లో అసలు మెయిన్ హీరో ఎవరు అనే చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద డిబేట్ జరిగింది. రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర హైలెట్ అని.. ఆయన సినిమాకు హీరో అని.. అ టైటిల్ రామ్చరణ్కు చెందింది అంటూ.. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు లేదు మా హీరోనే ఈ సినిమా హీరో. ఈ టైటిల్ కూడా మా హీరోకి సంబంధించిందే పెట్టారంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్గా వార్ చేస్తూ ఉండేవారు.
అయితే ఈ విషయంపై.. తాజాగా గ్రోకో ఏఐ క్లారిటీ ఇచ్చేసింది. గ్రోకో చాట్బర్డ్ సమాధానం చెబుతూ.. ఎన్టీఆర్ ఈ సినిమాకు మెయిన్ హీరో అని రిప్లై ఇచ్చింది. ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్ (ఎన్టీఆర్) మెయిన్ హీరోగా కనిపిస్తున్నారు. మల్లిని రక్షించడమే మిషన్ ని అతను సక్సెస్ఫుల్గా పూర్తిచేశాడు. అదే టైంలో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కో లీడ్ కనిపించారు. ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్లతో ప్రత్యేకంగా పోరాడినా.. కొమరం భీమ్ చివరకు తన లక్ష్యాన్ని చేరుకొని మల్లిని గూడానికి చేర్చాడు. ఇక దానికి అల్లూరి సీతారామరాజు లేయర్ మరింత డప్త్ను తీసుకువచ్చింది. దాదాపు ఇద్దరివి సమానమైన పాత్రలు అయినా.. భీమ్ పాత్ర.. ఆర్క్ ప్రధానంగా కథ నడిచింది. రాజమౌళి ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమాను తెరకెక్కించారు.
ఒక పాత్ర గొప్పది, మరొకరిది సైడ్ క్యారెక్టర్ అని తేల్చేయడం కష్టం. రాజు పాత్రలో ఉన్న అంతర్గత సంఘర్షణ సినిమాకు స్పెషల్ హైలెట్. ఇద్దరు హీరోలు నరేషన్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా అంటూ తెలిసింది. ఇక.. ఎంత కథ క్లారిటీగా చెప్పిన గ్రోకో ఏఐ.. ఎన్టీఆర్ మెయిన్ హీరో అనడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక మాస్క్ నేతృత్వంలోని ఏఐ సంస్థ.. ఎక్స్ఏఐ సిద్ధం చేసిన.. గ్రోకో చాట్బర్డ్ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాట్ జిపిటి పోటీగా వచ్చిన ఇది మెరుగైన సహయం అందిస్తూ దూసుకుపోతుంది. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లేటెస్ట్ గా వచ్చిన గ్రోకో ఏఐ ఫీచర్ తెలుగు యూత్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇంగ్లీష్ లో అడిగితే ఇంగ్లీషులో, తెలుగులో అడిగితే తెలుగులో క్లియర్ కట్ సమాధానం అందిస్తుంది. దీంతో కుర్ర కారు ఈ ఫ్యీచర్ బాగా ఉపయోగించుకుంటూ రకరకాల ప్రశ్నలతో సమాధానాలు పొందుతున్నారు. ఏదేమైనా తెలుగు సినిమాను అభిమానించే యూత్లో ఈ కొత్త ఏఐ మాత్రం వైరల్ గా మారింది. ఆర్ఆర్ సినిమా హీరోల విషయంలో ఇచ్చిన రిప్లై చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యపోతున్నారు.