టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో రాణిస్తున్న బాలయ్య.. మరో పక్కన రాజకీయాల్లోనూ మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాడు. ఎంతోమంది ప్రజల మన్నన పొందుతున్నాడు. అయితే బాలయ్య.. గతంలో వైఎస్ షర్మిల గురించి తన ఇంట్లో అసత్యపు ప్రచారాలు చేశారంటూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు నెటింట తెగ వైరల్ గా మారాయి.
ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా వైయస్ షర్మిల రియాక్ట్ అవుతూ.. ప్రభాస్ – షర్మిల రిలేషన్ గురించి బాలకృష్ణపై తప్పుడు ప్రచారం చేశారని.. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. నాకు ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదని.. ఇలాంటి తప్పుడు వార్తలు జగన్మోహన్ రెడ్డి.. తన సైకో బ్యాచ్ తో కలిసి ప్రచారం చేయిస్తున్నాడంటూ.. బాలయ్యకు ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదంటూ వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఇటీవల బాలయ్య కూడా రియాక్ట్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన బాలయ్య.. అక్కడ మీడియా ప్రశ్నలకు స్పందించారు.
బాలయ్య మాట్లాడుతూ.. వైఎస్ షర్మిలపై మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి.. దానిపై మీ స్పందన ఏంటి అని అడగగా.. షర్మిలపై తప్పుడు ప్రచారాలు చేస్తుందో అందరికీ తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. షర్మిలపై వస్తున్న ఆసత్య ప్రచారాలను వాళ్లే పట్టించుకోనప్పుడు.. నేను ఎందుకు పట్టించుకోవాలి అంటూ ప్రశ్నించాడు. అసలు వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని హేళనగా మాట్లాడారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందంటూ బాలకృష్ణ వైకాపా నాయకులు తీరుపై ఫైరయ్యారు. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి.