సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ రాసుకున్న కథకు హీరోగా మొదట ఒకరిని అనుకోని.. ఏవో కారణాలతో ఇతర హీరోలతో ఆ సినిమాలు చేయడం చాలా కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మారుతాయి. అయితే బాలయ్య కెరీర్లో ఆయన నటించిన ఓ సినిమా మాత్రం ఏకంగా ఆరుగురు స్టార్ హీరోలను దాటుకుని తన దాకా వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రియల్ హిట్. ఇంతకీ సినిమా ఏంటి.. అసలు ఆ స్టోరీ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. కే. మురళీమోహన్ రావు దర్శకుడిగా.. బాలకృష్ణ హీరోగా నటించిన కథానాయకుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
1984లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డులు క్రియేట్ చేసింది. బాలకృష్ణకు ఓరేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇక మొదటి సినిమాను పరుచూరి బ్రదర్స్ చిరంజీవి కోసం రాసుకున్నారట. కానీ.. చిరు తన పాత్ర కంటే శారద పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని సినిమాను వదిలేసాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరకు ఈ కథ వెళితే.. ఈ కథతో సినిమా తీస్తే జనం మనల్ని కొడతారంటూ కామెంట్స్ చేశాడట. ఇక అప్పట్లో స్టార్ హీరోగా హిట్లపై హిట్లు కొడుతూ దూసుకుపోతున్న సుమన్ దగ్గరకు వెళ్లి స్టోరీ వినిపించగా.. ఆయన కూడా దీనిని రిజెక్ట్ చేశాడు.
తర్వాత కృష్ణంరాజు, శోభన్ బాబు, రమేష్ ఇలా అప్పట్లో హీరోలుగా రాణిస్తున్న వారు ఎవరు ఈ సినిమా చేయడానికి నో చెప్పేశారు. కానీ.. ఇంతమంది రిజెక్ట్ చేసిన ఈ కథను చిట్టచివర ప్రయత్నం గా బాలయ్యకు వినిపించారట డైరెక్టర్. ఆయన కథ బాగా నచ్చడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలో నటించాడు. ఇక సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం బాలయ్య క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పాతిక కోట్ల మార్కెట్ కూడా చేయలేకపోయిన బాలయ్య సినిమాలు.. మొదటి రోజు రూ.50 కోట్లు కలెక్షన్లు కొలగొట్టే రేంజ్కు ఆయన ఎదిగాడు. ఈ క్రమంలోనే చివరి మూడు సినిమాలు ఏకంగా 100 కోట్ల క్లబ్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే బాలయ్యకు సినీ ప్రముఖుల, రాజకీయ ప్రముఖుల నుంచి విషెస్ వల్లువెత్తుతున్నాయి.