టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ఆయనను తిడుతున్న జనం కూడా ఉన్నారు. కారణం సినిమా మరోసారి వాయిదా పడడమే. చివరిగ మే 9న సినిమా రిలీజ్ ఉంటుందంటూ మేకర్స్ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 సార్లు వాయిదా పడిన ఈ సినిమా మళ్లీ తాజాగా మరోసారి వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కారణంగానే సినిమా వాయిద పడుతూ వస్తుందని.. అని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ వారంలో సినిమా షూట్ మొత్తం పూర్తిచేసి.. మే 9న రిలీజ్ చేసేవారని టాక్. కాని.. పవన్ కుమారుడు మార్క్ కి అగ్ని ప్రమాదం జరగడంతో.. సింగపూర్కు వెంటనే వెళ్లడంతో షూటింగ్ బ్రేక్ పడింది. ఇక ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్న వెన్నునొప్పి కారణంగా పవన్ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. దీంతో ఈ సినిమా మే 9న రిలీజ్ డేట్ నుంచి తప్పకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈరోజు రేపట్లో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానుంది.కేవలం పవన్ కి సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ లేదు. షాట్స్ కూడా ఇంకా డెలివరీ కాలేదని.. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం ఎన్నో కంపెనీలు పని చేస్తున్నా.. వాటిలో కేవలం రెండు కంపెనీల నుంచి మాత్రమే ఇప్పటివరకు వి ఎఫ్ ఎక్స్ షాట్స్ డెలివరీ అయ్యాయి. అది కూడా.. సినిమా వాయిదా పడేందుకు ఒక కారణం అని సమాచారం. కేవలం హరిహర వీరమల్లు సినిమాకు మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో చాలా పెద్ద సినిమాలకు విఎఫ్ఎక్స్ షాట్స్ నిర్దిష్ట సమయంలో డెలివరీ చేయకపోవడంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రొడ్యూసర్లు. ఇక హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఏం. రత్నం పరిస్థితి మరీ దారుణం.
సినిమాని మొదలుపెట్టిన ముహూర్తమే బాలేదో.. మరెమో కానా.. అనుకున్నట్లుగా జరిగిందే లేదు. అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు నిద్రపోని మనస్తత్వం ఉన్న ఏ.ఎం. రత్నం పవన్ కు సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ అంటే.. ఒక్క సన్నివేశం కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. నిజానికి ఆ సన్నివేశాన్ని తీసేసి సినిమా రిలీజ్ చేయవచ్చు.. కానీ రత్నం మాత్రం పర్ఫెక్షనస్ట్.. కచ్చితంగా సీన్ ఉండాల్సిందేనని పట్టు పడడంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తుందట. పరిస్థితులు కలిసి రాకపోవడంతో రత్నం చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పావన్ ఇప్పటికైనా కాస్త ఖాళీ చేసుకుని ఆయన నాలుగు రోజుల డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేస్తే.. కనీసం జూన్ నెల అయినా సినిమా రిలీజ్ అయ్యా అవకాశాలు ఉంటాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.