ప్రస్తుత లైఫ్ స్టైల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతులను మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో కచ్చితంగా వాట్సప్ క్రియేట్ చేసుకునే ఉంటారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్లో చాటింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని ద్వారా పలు సందేశాలతో పాటు.. వీడియోలు, ఫోటోలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఇదే కాదు వాట్సాప్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ అని రకరకాల గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసి అంతా కలిసి ముచ్చటించుకుంటున్నారు. అయితే.. సాధారణ జనాలకే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయట.
అందులో ముఖ్యంగా బన్నీ, చరణ్, రానా, నాని సీక్రెట్ గా వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నాం అని.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నాని వెల్లడించారు. తాజాగా హిట్ 3 ప్రమోషన్స్లో నాని వాట్సప్ గ్రూప్పై పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 10 నెలల క్రితం మంచు లక్ష్మి ఈ వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుందని తెలియజేశాడు. అయితే.. అప్పట్లో ఈ వాట్సప్ గ్రూపులో చాలా యాక్టివ్ గా ఉండే వాళ్ళమని.. అందరం కూడా జోకులు వేసుకుంటూ సరదాగా గడిపే వాళ్ళమని.. ఇప్పుడు ఆ గ్రూపును అంతగా పట్టించుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. వాళ్ళని అనడం కాదులే కానీ.. నేను కూడా ఆ గ్రూపులో మెసేజ్లు పెట్టడం మానేశా.. కనీసం మెసేజ్లు చూడడం కూడా ఆపేసా. రాను.. రాను.. గ్రూప్ కి ఆదరణ తగ్గిపోయింది.
చాలామంది నటీనటుల ఫోన్ నెంబర్లను కూడా మార్చేశారు. దీంతో మేమంతా టచ్ లో ఉండాలని అప్పుడు గ్రూప్ పెట్టుకున్నాం. కానీ.. కొన్ని రోజులకు ఆ గ్రూప్ సాధారణ గ్రూప్గా మారిపోయింది అంటూ నాని చెప్పుకొచ్చాడు. అన్ని విషయాలను షేర్ చేసుకునే రేంజ్కు గ్రూప్ వెళ్ళిందని.. ముఖ్యంగా ఈ గ్రూప్ ద్వారా వారి వారి సినిమా ట్రైలర్స్ ఇతర విషయాలను చెప్పుకొని ఒకరికి ఒకరు కామెంట్లు పెట్టుకునే వాళ్లం. కానీ.. ఇప్పుడు ఆదరణ కూడా తగ్గిపోయింది. ప్రతి విషయాన్ని అందులో షేర్ చేస్తున్నారు. అందుకే ఆ గ్రూప్ని నేను మ్యూట్లో పెట్టేసా. ఈ వాట్సాప్ గ్రూప్లోనే బన్నీ, చరణ్, రానా లాంటి హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళ మెసేజ్లు కూడా నేను చూడటం లేదు., మ్యూట్ లోనే ఉంచేసానని నాని వివరించాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్లు నెటింట వైరల్గా మారుతున్నాయి.