నందమూరి నటరసింహ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్గా ఎదురు చూస్తున్న మూవీ అఖండ 2 తాండవం. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా షూట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇది బాలయ్యకు మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
ఇక ఇప్పటివరకు బాలయ్య, బోయపాటి కాంబోలో మూడుసార్లు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూట్ ను జరుపుకుంటున్న ఈ సినిమా.. పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారు టీం.
ఇక నేడు డైరెక్టర్ బోయపాటి శ్రీను పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు పవర్ఫుల్ స్పెషల్ విషెస్ తెలియజేస్తూ ఫ్యాన్స్లోను కొత్త జోష్ నింపారు. ఈ విషెస్తో గత కొన్ని రోజులు నుంచి విపిస్తున్న అఖండ 2 రిలీజ్ రూమర్లపై కూడా చెక్ పెట్టేసారు. ఈ సినిమా సెప్టెంబర్ రేస్ నుంచి తప్పుకుందని.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ వెళ్లినట్టుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ.. ఇపుడు దీనిపై క్లారిటీ ఇచ్చేశారు టీం. ఆ రూమర్లలో నిజం లేదని.. సెప్టెంబర్ 25నే దసరా కానుకగా థియేటర్స్ లో అఖండ 2 తాండవం మొదలవుతుందని కన్ఫర్మ్ చేశారు.
The man who creates Mass hysteria in theatres ❤🔥
Team #Akhanda2 wishes the blockbuster director #BoyapatiSreenu Garu a very Happy Birthday ✨
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/KVjmgVlNAb
— 14 Reels Plus (@14ReelsPlus) April 25, 2025