ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ రూపోందిన సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ఎక్కించేందుకు ప్లాన్ చేసిన జక్కన్న ఇప్పటికే సినిమాస్ షెడ్యూల్ లను సర్వే గంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా రెండు స్కెడ్యూలను పూర్తి చేసిన టీం.. మూడో షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లోనే.. ఈ స్కెడ్యూల్ జరగనుంది. అడ్వెంచర్స్ థ్రిల్లర్గా మహేష్ రోల్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే.. ఇప్పటికే మహేష్ రోల్పై ఆడియన్స్ లో విపరీతమైన సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పుడు అసలు పూర్తిస్థాయి విలన్ పృథ్వీరాజ్ కూడా కాదంటూ టాక్ వైరల్ గా మారుతుంది. మహేష్ను బలంగా ఢీకొట్టే అసలు సిసలు ప్రతి నాయకుడు మరొకరు ఉన్నాడని.. గ్లోబల్ స్థాయిలో సినిమా ప్లాన్ చేస్తున్న క్రమంలో విలన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాడని టాక్ నడుస్తుంది. రాజమౌళి ఇప్పటివరకు ఆ విషయాన్ని లీక్ చేయలేదు. అయితే ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నుంచి.. ఆఫ్రికన్ నటుడిని రంగంలోకి దింపనున్నాడని.. ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ కనుక ఈ సినిమాలో అదే ప్రాంతానికి చెందిన నటుడు విలన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని జక్కన్న భావిస్తున్నాడట. అయితే ఆ నటుడు ఎవరు.. అతని రోల్ ఎలా ఉండబోతుందని మ్యాటర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు.
ప్రతినాయకుడి పాత్ర విషయంలో అలాంటి సీక్రెట్, సస్పెన్స్ మెయింటైన్ చేయడం మొదటి నుంచి జక్కన్నకు అలవాటే. ఇక దీనికి ఉదాహరణలు చూసుకుంటే బాహుబలిలో కాలకేయ. ఈ పాత్రను ప్రభాకర్ పోషించాడు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలో నటించిన ప్రభాకర్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాలో తిట్ల పాత్రలో అజయ్ నటించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చిన్న చిన్న పాత్రలో మాత్రమే నటించిన అజయ్.. ఈ సినిమాలో తన విలన్ పాత్రలో ఆడియన్స్ను ఆకట్టుకుని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్, చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోను విలన్గా ఓ తెల్ల జాతీయుడిని తీసుకొని నటింపజేశాడు. అలాగే ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 విషయంలోనూ అదే స్టేటస్ని వాడబోతున్నాడని.. పెద్దగా ఆడియన్స్ కు పరిచయం లేని వ్యక్తిని పవర్ ఫుల్ విలన్ గా ఆడియన్స్ కు చూపించనున్నాడని సమాచారం.