టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బోళా శంకర్తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి పెద్ద షాక్ ఇచ్చింది. దీనికంటే ముందు ఆచార్య ఫ్లాప్ ఎదుర్కొన్న చిరు.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కసితో చేస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు.. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిష, ఆశిక రంగనాథన్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురైనా సంగతి తెలిసిందే.
కాగా ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదట్లో ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్గా రూపొందిస్తున్నారని టాక్ నడవడంతో.. ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది. కానీ.. ఆ హైప్ అంతా ఫస్ట్ క్రీమ్స్ తో పట్టా పంచలు చేసేసారు. గ్రాఫిక్స్ అసలు ఊహించిన రేంజ్లో లేదని.. చిరు సినిమాకు ఇలాంటి చెత్త గ్రాఫిక్స్ ఆ అంటూ నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మళ్లీ విఎఫ్ఎక్స్ పై ఫోకస్ చేసిన టీం మొత్తం మార్చేసే పనిలో బిజీ అయ్యారు.
ఈసారి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ మూవీ ఓటిటి రైట్స్ పై కూడా పడడంతో.. మూవీ టీంలో ఆందోళన మొదలైందట. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాకు వచ్చిన నెగిటివిటీ నేపథ్యంలో హైప్ను క్రియేట్ చేయడం కూడా కష్టమే. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలంటే.. విశ్వంభర ప్రమోషన్స్ మరింత ఎఫెక్టివ్ గా చేయాల్సి ఉంటుందని.. ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. లేదంటే సినిమాపై హైప్ క్రియేట్ కాదు సరికదా.. సినిమాపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని టెన్షన్ అభిమానుల్లోనూ నెలకొంది. మరి టీం ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.. ఆడియన్స్ లో ఎలాంటి హైప్ను క్రియేట్ చేస్తారు వేచి చూడాలి. మళ్లీ అదే తప్పు చేస్తే మాత్రం ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతారు అనడంలో సందేహం లేదు.