టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్తో ఫ్లాప్ సినిమాలు సైతం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు ను స్టార్ హీరో చేసిన సూపర్ హిట్ మూవీని మాత్రం రీ రిలీజ్లో అసలు ఎవరు చూడడానికి కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు. ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ చేసినా కలెక్షన్లు మాత్రం ప్రతిసారి మేకర్స్ కు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఎకడు. ఈ మవీ ఏకంగా ఐదుసార్లు రిలీజ్ అయిన.. అస్సలు సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కలెక్షన్ల పై దెబ్బ పడుతుంది.
మహేష్ బాబును స్టార్ హీరోగా తీర్చిదిద్దిన సినిమాలలో ఇదీ ఒకటి. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మహేష్.. ఈ సినిమాతో మాస్ ఇమేజ్కు చేంజ్ అయ్యాడు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా, ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన పోకిరి.. మహేష్ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. అయితే రీ రిలీజ్లో ఒక్కడు సినిమా ఆడడం లేదు. ఫ్యాన్స్ సైతం ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు సార్లు రిలీజ్ చేసినా ఇదే పరిస్థితి. ఒక్కడు సినిమాను ఐదవ సారి రిలీజ్ చేస్తే మొత్తంగా కేవలం రూ.18 లక్షల గ్రాస్ వసూలు మాత్రమే రావడం ఆశ్చర్యకరం. మహేష్ ఫ్యాన్స్ కు క్యారాఫ్ అడ్రస్గా నిలిచిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుదర్శన్ థియేటర్లలో తప్ప మారే థియేటర్లలోను సినిమాకి ఇప్పటివరకు హౌస్ ఫుల్ పడిందే లేదు. అంతే కాదు.. మొత్తం గ్రాస్ లెక్కేసుకుంటే రూ.3. 20 కోట్లు మాత్రమే వచ్చాయి. కాగా మహేష్ ఫ్లాప్ సినిమాలు సైతం హిట్ అందుకుంటుంటే.. ఒక్కడు సినిమా మాత్రం మొదట హిట్గా నిలిచి కూడా.. ఐదుసార్లు రిజల్ట్ ఫ్లాప్ అవ్వడం అందరికి షాక్ కలిగిస్తుంది.