టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో, వెబ్ సిరీస్లలో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంది.. తెలుగు సోయగం తేజస్వి మదివాడ. ఈ అమ్మడుకి.. ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల కంటే గ్లామర్ షోలతో కుర్రాళ్ళను ఎక్కువగా కాక పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ రియాల్టీ షోతో విపరితమైన పాపులారిటీ దక్కించుకుంది. అయితే చివరివరకు ఆడి విన్నర్గా మాత్రం నిలవలేకపోయింది. తన ముక్కుసూటి మనస్తత్వంతో.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ హౌస్ మెట్లకే కాదు.. హౌస్ మెట్స్ అభిమానులకు కూడా విరోధిగా మారింది. అతి తక్కువ టైంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది.
ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తేజస్వి.. తర్వాత బుల్లితెరపై పలు షోస్తో పాటు.. రకరకాల ఇంటర్వ్యూలలోను సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ శివతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి.. తన వ్యక్తిగత విషయాలతో పాటు.. టాలీవుడ్లో కమిట్మెంట్లపై షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ల సమస్య చాలానే ఉందని చెప్పుకొచ్చిన తేజస్వి.. అన్ని రంగాల్లో ఇది పాకిపోయిందని.. కొందరైతే హీరోయిన్లను చాలా సులువుగా కమిట్మెంట్స్ అడిగేస్తున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. వాళ్లు అడిగే విధానం కూడా ఇలా ఉంటుంది అంటూ తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ముందుగా పరిచయం చేసుకుని ఫస్ట్ చేతులను తాకట్టు ఉంటారని.. అలా వచ్చిన ప్రతిసారి కూడా తాకుతూనే మాట్లాడతారని.. దాంతో వారి మధ్య క్లోజ్నెస్ కూడా పెరగడంతో.. కమిట్మెంట్ అడిగేస్తారని.. తన కెరీర్ ప్రారంభంలో కూడా తనకి ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదురయ్యాయని.. చెప్పుకొచ్చింది. ఆఫర్ల కోసం వెళితే సాయంత్రం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ తో డిన్నర్ ఉంటుందని చెప్తారని.. ఒంటరిగా రమ్మంటారని.. దీంతో వారి దురుద్దేశం ఏంటో అర్థమై వెళ్లకుండా ఉండిపోయేదాన్ని అంటూ తేజస్వి మదివాడ వెల్లడించింది. ఇలాంటి విషయాలలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్లు జాగ్రత్తలు తీసుకోండి అంటూ తేజస్వి వివరించింది. ప్రస్తుతం తేజస్వి మదివాడ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి.