తల్లితో తన ఫోటోలను షేర్ చేసిన మహేష్.. మిస్ యు అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రిన్స్గా అడుగుపెట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సినీఈ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్లను సొంతం చేసుకున్న మహేష్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టులో మహేష్.. బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

కాగా.. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు తల్లిని గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 2022లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. నేడు ఆమె పుట్టిన రోజు కావడంతో.. మహేష్ ఆమెతో స్పెంట్‌ చేసిన హ్యాపీ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీంతోపాటే ఆయన ట్యాగ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Mahesh Babu pays tribute to mom Indira Devi on 11th day ceremony. See pics - India Today

మహేష్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ మిస్ యు అమ్మ.. నిన్ను ఎంతలా మిస్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ తెగ వైరల్ గా మారడంతో.. అభిమానులంతా ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేస్తూనే.. మహేష్ కు స్ట్రాంగ్ గా ఉండమంటూ ధైర్యం చెబుతున్నారు. తను అనుకున్న అన్నింటిలోనూ సక్సెస్ సాధించాలని.. సినీ కెరియర్లో మరింత ఎత్తుకు ఎదగాలని.. మరిన్ని హిట్లు తన ఖాతాలో వేసుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)