తారక్ మామకి హైడ్రా దెబ్బ.. పిల్లాడి లెటర్ తో నార్నె కు బిగ్ షాక్..!

ప్రభుత్వ చెరువులు, భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుని కట్టడాలు స్థాపించారని.. హైడ్రా చేస్తున్న ఆపరేషన్‌లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత పెద్దవారు ఉన్నా సరే హైడ్రా అస్సలు సహించడంలేదు. వదిలి పెట్టడం లేదు. అలా తాజాగా హైదరాబాద్లో పెద్ద చాపే ఇప్పుడు హైడ్రా వ‌ల‌లో పడింది. ఏకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామ.. బిగ్ బడా బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాస్‌ ఆధీనంలో ఉన్న భూమి పై హైడ్రా ఆపరేషన్ నిర్వహించారు. కాగా.. తాజాగా హైదరాబాద్‌ లంగర్ హౌస్ కు చెందిన ఓ బాలుడు పెట్టిన కంప్లైంట్తో.. ఓ పెద్ద డొంక‌ కదిలింది. భారీ ప్రభుత్వ ఆస్తులు కబ్జా బారి నుంచి బయటపడ్డాయి. ఆ బాలుడు రాసిన లెటర్ వల్లే జూబ్లీహిల్స్ లాంటి కాస్ట్లీ ప్లేస్ లో 39 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమి.. తిరిగి ప్రభుత్వానికి దక్కింది. దీనివల్ల ఏకంగా రూ.3,900 కోట్లకు పైగా నష్టం తప్పింది.

HYDRAA Cracks Down on Encroachments in Govt Lands at Ameenpur and Rayadurg, Recovers Land Worth Hundreds of Crores

ఇంతకీ ఆ చిన్న బాబు రాసిన లేకేంటి.. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఆ బాలుడు జేఎల్సి కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బహిరంగస్థలంలో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అయితే సడన్గా గ్రౌండ్ కు కంచెలు వేసి కన్స్ట్రక్షన్లు ప్రారంభించారు. ఈ క్రమంలోనే హైడ్రా విషయంలో ఐడియా ఉన్న బుడ్డోడు నిర్మాణాలపై కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు లెటర్ పంపాడు. వెంటనే హైడ్రా టిం దానిపై పరిశోధన మొదలుపెట్టగా.. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని.. ప్రస్తుతం చట్టపరమైన వివాదాల్లో ఉందని వెళ్లడైంది. హైడ్రా ఈ స్థలాన్ని పరిశీలించి భూమిని అమ్మడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియడంతో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను కూల్చేసింది. ఇక దీనిపై కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నిషేధ జాబితాలో ఉన్న భూమిలో నార్ని ఎస్టేట్స్ నిశ్శబ్దంగా అమ్మకాలు చేసేస్తున్నారని.. చట్టపరమైన వివాద టైంలో ఏదైనా అభివృద్ధి , అమ్మకం అసలు సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఐటీ దాడులు | ITraids on Junior NTR father in law ycp leader narne srinivas rao - Telugu Oneindia

హైదరాబాద్ లోనే రిచెస్ట్ జోన్లలో ఎకరానికి 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్నచోట.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు సంబంధించి కోట్లలో వివిధ కేసులు ఉన్న.. చుట్టూ ప్రహరీ కట్టేసి సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని.. అలాగే 39 ఎకరాల భూమి అక్రమంగా దోచేస్తున్నారని తెలిపారు. ఇక ప్రస్తుతం అక్రమంగా కబ్జా చేసి పెట్టిన బోర్డులన్నింటిని తొలగించి.. ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని హైడ్రా అధికారులు పేర్కొంటూ కొత్త బోర్డులను స్థాపించారు. ఇక నార్నె ఎస్ట‌ట్స్ యజమానిగా నార్నె శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. తారక్ భార్య.. ప్రణతి తండ్రి అయిన శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ సంస్థే భూములను కబ్జా చేసినట్లు హైడ్రా చెప్తుంది. రాయదుర్గం నార్నే పేరుతో ఉన్న రోడ్ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ లు జరుగుతుండగా.. ఇప్పుడు ఆ భూములు కబ్జాలని.. హైడ్రా నిద్దరించింది. ఈ కూల్చివేత పైన నార్నె గ్రూప్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.