టాలీవుడ్ మేగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి.. ఆడియన్స్ను పలకరించాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. సంక్రాంతి బరిలో పరమరొటీన్ స్టోరీ తో వాస్తవానికి దూరంగా రూపొందిన ఈ మూవీపై రిలీజ్కు ముందే భారీ అంచనాల నెలకొన్నయి. కాగా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలు అందుకోలేక డీలపడింది. ఈ క్రమంలోనే సినిమాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. శంకర్ పై కూడా విమర్శలు ఎదురయ్యాయి. అలాగే.. ఓటీటీలో రిలీజ్ తర్వాత కూడా ఇలాంటి రెస్పాన్సే దక్కించుకుంది గేమ్ ఛంజర్.
కాగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని తిట్టిపోసినా.. హిందీ ప్రేక్షకుల మాత్రం చరణ్.. గేమ్ ఛస్త్రంజర్కు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాతో.. విపరీతమైన నష్టాలు వచ్చాయని టాక్ నడిచింది. అయితే.. హిందీ వర్షన్ ఓటీటీ రైట్స్ దిల్ రాజు.. జీ తెలుగు ఛానల్ కి విక్రయించగా.. మార్చి 7 నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా సుమారు 6 వారాల నుండి నాన్ స్టాప్ ట్రెండింగ్ అవుతూనే ఉందట. ఇప్పటికీ టాప్ పొజిషన్ లోనే గేమ్ ఛేంజర్ ఉండడం విశేషం. దీంతో హిందీలో చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో.. ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం అవుతుందంటూ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న.
ఈ సినిమా ఇప్పటివరకు 400 మిలియన్ మినిట్స్ వాచ్ టైం వచ్చిందని.. ఇదొక సెన్సేషనల్ రికార్డు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక మరోవైపు రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవానుంది. జగపతిబాబు కన్నడ స్టార్ శివ రాజకుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి సంచలన రెస్పాన్స్ దక్కింది. ఇక వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది.