స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ ను దశాబ్దకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్రహీరోలా అందరి సరసన నటించి.. తెలుగులో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటున్నా ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ కి సిద్ధమైంది. నటిగా కాకుండా.. నిర్మాతగా ఈసారి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయిన శ్యామ్.. సొంత బ్యానర్ ట్రాలాలాను స్థాపించి శుభం సినిమాతో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమైంది. మే 9న ఈ సినిమా రిలీజ్ డేట్ను అఫీషియల్గా ప్రకటించారు.
ఇందులో భాగంగా తాజాగా నెల్లూరులోని ఒక కాలేజీ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది. ఇందులో సమంత మాట్లాడుతూ.. తను మొదటి సినిమాలో చాలా ఘోరంగా నటించానని.. అది చూస్తున్నప్పుడల్లా సిగ్గేస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇక సమంత నటించిన మొట్టమొదటి మూవీ ఏ మాయ చేసావే అన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ఆడియన్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ సినిమా ఎంతోమంది ఫేవరెట్ కూడా. అయితే ఇలాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తనకే నచ్చలేదని సమంత చేసిన కామెంట్స్ అందరికి షాక్ ను కలిగించాయి.
ఇక శ్యాం ప్రస్తుతం బాలీవుడ్లో రక్త బ్రహ్మండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుతుంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లో ఉన్నాయి. కాగా.. సమంత కామెంట్స్ చేసిన ఏ మాయ చేసావే సినిమా ఆమె కెరియర్ లోనే సో స్పెషల్ తెలుగు ఇండస్ట్రీకి ఆమెను పరిచయం చేసిన సినిమానే కాదు.. తన మాజీ భర్త నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకోవడానికి కూడా ఈ సినిమా ప్రధాన కారణం. అయితే తర్వాత మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడిపోయినా.. ఇప్పటికి చాలామందికి ఏ మాయ చేసావే మూవీ ఫేవరెట్ కావడం విశేషం.