టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుని రాణిస్తున్నాడు. అంతేకాదు.. ముందు ముందు మరిన్ని భారీ ప్రాజెక్టులతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ మకాం మార్చేయబోతున్నాడని.. హైదరాబాద్ నుంచి వేరేచోటకు కొత్త కాపురం షిఫ్ట్ చేస్తున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా.. దుబాయ్ బాటలు పడుతున్న సంగతి తెలిసిందే.
వెకేషన్లకి వెళ్లాలన్నా.. షాపింగ్ లోకి వెళ్ళాలన్నా.. అవసరం అయిన ముందు మూడు గంటల జర్నీ కనుక.. ఊ అంటే చాలు అలా దుబాయ్ కి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ లో ఇల్లు కొనేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా ఇటీవల దుబాయ్ కి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆమె దుబాయ్ కి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎప్పటికైనా దుబాయిలో సెటిల్ కావాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం.
ఒకప్పుడు హైదరాబాద్కు దూరంగా కాస్త రిలాక్స్ కావాలంటే సెలబ్రిటీస్ అంతా ముంబైకి చెక్కేసేవారు. కానీ.. ప్రస్తుతం పాన్ ఇండియన్ ఇమేజ్ ఏర్పడడంతో ఎక్కడ ఫ్రీగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దుబాయ్ పై సెలబ్రిటీస్ దృష్టి సారిస్తున్నారని.. పైగా మనకు దగ్గరగా ఉండే దేశం.. అది పెద్ద అడ్వాంటేజ్ కనుక బన్నీ కూడా దుబాయ్ కి మకాం మార్చేయాలని చూస్తున్నాడట. బన్నీ ఇప్పుడు అట్లీతో మరో భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత.. లేదా మరో రెండు సినిమాలను కూడా చేసి తర్వాత దుబాయ్కి ముకాం మార్చేసిన నో డౌట్.