టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్బస్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా తర్వాత పుష్ప కు సెక్యువల్గా పుష్ప 2 సినిమాలో నటించి సాలిడ్ సక్సెస్ ని దక్కించుకున్నాడు.
దాదాపు రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన ఇండియన్ సినిమాగా ఈ మూవీ సత్తా చాటుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఆల్ టైం రికార్డ్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన బన్నీ.. అంతే పవర్ఫుల్ కంటెంట్తో మరోసారి సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే డైరెక్టర్ అట్లీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏఏ 22 రన్నింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్పైకి రానుంది.
అయితే.. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ సెలెక్ట్ అయిందని.. ఇప్పటికే పలు లుక్ టెస్ట్ లు కూడా పూర్తయినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మొదట సమాంతను భావించారట. ఈ విషయాన్ని సమంతతో చెప్పగా తను ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని.. అయినా వినకుండా సినిమాలో ఐటెం సాంగ్స్ చేయమంటూ సమంతను ఇబ్బంది పెడుతున్నారని టాక్. తాను మాత్రం ఐటెం సాంగ్ చేయడానికి అస్సలు ఇష్టపడడం లేదట. ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది వైరల్ అవ్వడంతో.. సమంత మళ్ళీ సినిమాలో ఐటెం సాంగ్లో నటిస్తుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.