నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో అఖండ తాండవంపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు టీం.
ప్రస్తుతం శర్వే గంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే కుంభమేళా, హిమాలయాలు లాంటి పలు కీలక ప్రదేశాల్లో షూట్ ను కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ జార్జీయాలో రూపొందించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కెడ్యూల్కు సంభందించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఓ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నాడని సమాచారం. అతను మరెవరో కాదు సన్నీ డియోల్.
సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీ డియోల్ క్యారెక్టర్ తో కథ కీలక మలుపు తిరుగుతుందని.. భారీ ట్విస్ట్లు చోటు చేసుకుంటాయని సమాచారం. ఈ ట్విస్ట్ అఖండ 3కి లీడ్ అవుతుందని టాక్. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తుంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ అచ్చంట, గోపిచంద్ అచ్చంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను రీచ్ అవుతుందో.. లేదో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.