ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల వైపు ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా రాజమౌళి తెలుగు సినీ ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఈయన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా ఓ అద్భుతం అనే చెప్పాలి. రాజమౌళి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఎన్నో సంచలనాలను సొంతం చేసుకుని ఎంతో మంది దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక ఇటీవల జక్కన్న జీవిత విశేషాలతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి గురించి తారక్ మాట్లాడుతూ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి. ఆగస్టు 2వ తేదీ నుంచి మోడ్రన్ మాస్టర్స్ పేరుతో రాజమౌళి జీవిత విశేషాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళికి అసలు సానిభూతి లేదని.. ఆయన ఓ పిచ్చోడని.. అతనితో వాదించి ప్రయోజనం ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకి ఏం కావాలో ఇచ్చేసి అక్కడ నుంచి కామ్గా వెళ్లిపోవడమే అంటూ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని కథలను ప్రపంచానికి చూపించడం కోసం ఆయన పుట్టాడని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన లాంటి డైరెక్టర్ని నేను ఇప్పటివరకు చూడలేదని.. సినిమాలంటే పిచ్చి ప్రేమ అంటూ చెప్పుకొచ్చాడు.
జేమ్స్ కామెరున్ మాట్లాడుతూ రాజమౌళికి సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు.. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం.. అతను ఎవరితోనైనా పనిచేయగలడంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ జక్కన సినిమాలో నన్ను నేను చూసి ఆశ్చర్యపోయా అంటూ కామెంట్స్ చేశారు. రామా రాజమౌళి మాట్లాడుతూ రజమౌళితో పనిచేసిన వారంతా ఆయనను పని రాక్షసుడు అని పిలుస్తారని వివరించింది. ఇక రాజమౌళి పై వీరందరూ చేసిన కామెంట్స్.. ట్రైలర్గా రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ డాక్యుమెంటరీ ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి. ఇక తెలుగు సినీ అభిమానులు కూడా రాజమౌళి డాక్యుమెంటరీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉండడం విశేషం.