తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హరిష్ శంకర్.. చివరగా గద్దల కొండ గణేష్ సినిమాతో ఆడియన్స్ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత హరిష్ శంకర్ నుంచి మరో సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. అయితే నెల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఈచన తెరకెక్కించిన 7 సినిమాల్లో రెండు రీమిక్స్ సినిమాలు కావడం విశేషం.
గబ్బర్ సింగ్ హిందీ డబ్బింగ్ రీమేక్ కాగా.. తమిళ్ జిగర్తాండ రీమేక్గా గద్దల కొండ గణేష్ సినిమాలు తెరకెక్కించాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడాహరీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కూడా రీమేక్ గానే తీస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో హరీష్ శంకర్ గురించి ఓ నెటిజన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్గా మారాయి. అయన మాట్లాడుతూ సార్ మీరు రీమిక్స్ సినిమాలను ఆపేయండి.. సొంతంగా సినిమాలను మీరు చాలా బాగా తెరకెక్కించగలరు. మీరు రాసి తీసిన కథలు ఖచ్చితంగా హిట్ అవుతాయి. మంచి హిట్ కథతో త్రో బ్యాక్ అవుతారని ఆశిస్తున్నా. అలాగే త్వరలోనే రానున్న మీ మిస్టర్ బచ్చన్ సినిమాకు గుడ్ లక్ అంటూ కామెంట్స్ చేశాడు.
ఈ విధంగా తన సినిమా గురించి నేటిజన్ చేసిన కామెంట్స్ పై హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత అది రీమేక్ అని నువ్వు ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో.. నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ డైరెక్టర్.. నువ్వు ఎప్పుడు కావాలనా నాకు మెసేజ్ చేయొచ్చు అంటూ హరీష్ శంకర్ సమాధానం చెప్పాడు. ఇలా చెప్పిన సమాధానంతో మిస్టర్ బచ్చన్ సినిమా రీమేక్ కాదని క్లియర్ గా తెలుస్తుంది. ఇక దాదాపు 13 సంవత్సరాలు తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులను మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.