పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి మూవీపై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ ఆఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. దాదాపు 3 ఏళ్ల క్రితం ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు. తన బ్యానర్‌లో తెర‌కెక్కిస్తున్న మెకానిక్ రాకీ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ గురించి స్పందించాడు.

దీనిపై ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మన చేతిలో ఏది ఉండదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మా వైపు నుంచి పని పూర్తయిపోయింది. స్క్రిప్ట్ కూడా లాక్ చేసేశాం. పూజ కార్యక్రమం జరిగింది. ఇంకా అంతా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉంది. వారం క్రితం ఆయన్ని కలిశా. వీలు చూసుకుని సినిమాలు చేయొచ్చు అని అన్నారు అంటూ సురేందర్ రెడ్డి వివరించాడు. ఇటీవల ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పదవి బాధ్యతలు బిజీ గల గడుపుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. క్తిష్‌తో హరిహర వీరమల్లు, సుజిత్ ఓజీ, హ‌రీష్ శంక‌ర్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ ఎలక్షన్‌ల బిజీతో ఈ సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేసిన పవన్.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవిలో బిజీగా గడుపుతున్నాడు. ఇక పవర్ స్టార్, సురేందర్ రెడ్డి ప్రాజెక్టును 2020లో ప్రకటించారు. 2021లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. తుపాకీతో పవన్ కళ్యాణ్ ఉన్న పోస్టర్ య‌థా కాలమ్‌ తదావ్యవహారం టైటిల్‌తో లీజ్ చేశారు. సమకాలీన అంశాలతో పాటు యాక్షన్‌ను జోడించి ఈ సినిమా తెరకెక్కించనున్నారని.. అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక సినిమాకు వ‌క్కాంతం వంశీ రైటర్ గా పని చేశాడు.