గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ మొదలైన దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమాను నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తుది దశకు చేరడంతో ఈ నెల నుంచి రామ్ చరణ్ ఆర్సి 16 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు, ఓ పక్కన గేమ్ చేంజర్ సెట్స్ లో పాల్గొంటూనే మరో పక్కన ఆర్ సి 16 సెల్స్లోను సందడి చేయనున్నాడు చరణ్.
గత కొద్ది రోజులుగా డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూట్ కోసం రంగస్థలం తరహాలో భారీ విలేజ్ సెట్ ను డిజైన్ చేశారంటూ ఫిలిం వర్గాల నుంచి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70% షూటింగ్ ఈ సెట్స్ లోనే జరపనున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సెట్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారట. దాదాపు రూ. 25 నుంచి రూ. 30 కోట్ల వరకు ఈ సెట్ కి ఖర్చు చేశారని న్యూస్ వైరల్ అవుతుంది.
విలేజ్ సెట్ సహా బ్యాక్ డ్రాప్ బాగా ఓల్డ్ కావడంతో.. అంతా నేచురల్ గా ఉండాలంటే ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని మేకర్స్ భావించారని.. ఈ విషయంలో ఎక్కడ ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గడం లేదంటూ తెలుస్తోంది. అయితే ఇంకా అదనపు సెట్ కు చాలా ఖర్చవుతుందట. బ్యాగ్రౌండ్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందని తెలుస్తుంది. వాటికోసం కూడా భారీగా ఖర్చు చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. షూటింగ్ అంతా ఆ సెట్స్ లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నటింట వైరల్ అవ్వడంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ సినిమా అంటే ఆ మాత్రం ఖర్చు చేయడంలో తప్పులేదు అంటూ.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తే బాగుండు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.