ఆ విషయంలో తగ్గేదేలే.. భూమిక ఈ ముగ్గురిని మడత పెట్టేసిందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. గతంలో థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఇప్పుడు మళ్లీ ఆ స్టార్ హీరోల పుట్టినరోజులకు మళ్లీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అతడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా వరకు ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లో మళ్ళీ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు కూడా అందుకున్నాయి.

18YearsForOkkadu: MS Raju thanks the team of Okkadu, hints sequel with  Mahesh Babu | Telugu Movie News - Times of India

ఇక తాజాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా ఒకటి మళ్లీ రీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వచ్చి అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నిజానికి ఈ సినిమాతోనే రాజమౌళి కూడా స్టార్ దర్శకుడుగా తన ముద్ర వేశాడు. 2003లో వచ్చిన ఈ సినిమాను మళ్లీ ఇన్ని సంవత్సరాలకు రీ రిలీజ్ చేయబోతున్నారు.

Bhumika Chawla & Jr Ntr Blockbuster Action Scene | Telugu Interesting Scene  | Telugu Videos - YouTube

అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా మాత్రమే అత్యధిక కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇక మొన్న విడుదలైన మహేష్ బాబు ఒక్కడు సినిమాలో కూడా భూమిక హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతున్న సింహాద్రి లో కూడా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో కూడా భూమికనే హీరోయిన్ కావడం విశేషం. సింహాద్రి సినిమాతో కూడా భూమిక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.