వీర సింహారెడ్డి కామెంట్స్ పై.. అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్..!

ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ ను హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ వేడుకలో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. బాలకృష్ణ మాట్లాడుతూ టాలీవుడ్ లెజెండ్రీ హీరోలైన ఎస్వీ రంగారావు, అక్కినేని తొక్కినేని అంటూ తన ప్రాసులో వెళ్లిపోవడం సోషల్ మీడియాలో ఎప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఇష్యూ జరిగీ ఇప్పటికి రెండు రోజులు అవుతున్న బాలకృష్ణ దగ్గర నుంచి ఎటువంటి సంజాయిషీ రాకపోవటంతో ఇప్పుడు మరింత రభసకు దారితీసింది.

ఈ ఇష్యూ పై అక్కినేని హీరోలు స్పందించాలంటూ అభిమానులు చేసిన ఒత్తిడికి అక్కినేని బ్రదర్స్ చైతు- అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వారు తమ మనసులోని మాటను ఎంతో హుందాగా ఎవరికి తగలలో తగిలే విధంగా వెల్లడించారు. ‘నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు ఈ అగ్రనటులు మన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం చంపుకున్నట్టే అని చెబుతూ తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు’. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకేసారి సోషల్ మీడియాలో ఒకే రకమైన పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇప్పుడూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని సగటు సినీ ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. ఇక ఈ ఇష్యుని పెద్దది చేయడం వలన బయట వారికి ఇది మన గౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్టు అవుతుందని బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఇటీవల ఓ వివాదం విషయంలో బాలకృష్ణ ఓపెన్ లెటర్ ద్వారా వారికి సారీ చెప్పి తన పెద్దరికం నిలబెట్టుకున్నడు. ఇప్పుడు కూడా అదే చేస్తే జరిగే నష్టమేమీ లేదు పైగా తన తండ్రి ఎన్టీఆర్ తో పధ్నాలుగు మల్టీస్టారర్స్ లో నటించిన ఏఎన్ఆర్ గురించి నాలుగు చక్కని మాటలు చెప్పి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లాగుతూ పోయేకొద్దీ తాడు తెగుతుందే తప్ప గొడవ ఇంతటితో ఆగదు.