మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు.
ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రిమెక్గా వచ్చింది. నిన్న దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చింది. డైరెక్టర్ మోహన్ రాజా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అవటంతో ఇప్పుడు మోహన్ రాజా రామ్ చరణ్ తో ధ్రువ 2 సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను గాడ్ ఫాదర్ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లే ఈ సినిమాను నిర్మిస్తారట. మోహన్ రాజ ఇప్పటికే రామ్ చరణ్ తో చేయబోయే సినిమా స్టోరీని కూడా రెడీ చేశారట. రామ్ చరణ్ త్వరలోనే ధ్రువ 2 సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.