“నువ్వు పచ్చి మోస గాడివి”.. ఆయన పై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్..!

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవ‌ల‌ కాలంలో తన సొంత బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ – హారిక హాసిని బ్యానర్లతో కలిసి సంయుక్తంగా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నాగవంశీ తాజా సినిమా స్వాతిముత్యం ఈనెల 5న‌ ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగ వంశీ.

Swathi Muthyam' handles a sensitive topic in a fun manner: S Naga Vamsi - Telugu News - IndiaGlitz.com

ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు బెల్లంకొండ గణేష్. అతనికి జంటగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ తర్వాత సినిమా మహేష్- త్రివిక్రమ్ కాంబోలో సినిమా గురించి కామెంట్లు చేశాడు.

 Producer Naga Vamshi Interesting Comments About Mahesh-trivikram Moviemahesh Babu,naga Vamshi,ssmb,swathimuthyam Press Meet,trivikram Srinivas-మాటలు చెప్పి మోసం చేస్తావ్.. మహేష్ నిర్మాతపై అభిమానులు ఫైర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను ఓ మంచి కమర్షియల్ సినిమాగా తీస్తున్నామని అన్నాడు. ఆయన చేసిన ఈ కామెంట్లకు మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నేమో యాక్షన్ సినిమా అన్నారు ఇప్పుడేమో కమర్షియల్ సినిమా అంటున్నారు, మరి కొన్ని రోజులు ఆగితే ఈ సినిమాను సందేశాత్మక సినిమా అని అంటారేమో అంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాగ వంశీ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నువ్వు పచ్చి మోస గాడివి నువ్వు ఎప్పుడు నిజాలు చేపవంటు మహేష్ బాబు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆయనపై ఫైర్ అవుతున్నారు.