వైసీపీ పోరు..ఉత్తరాంధ్రలో ఆధిక్యం పెరిగిపోతుందా?

విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి..ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గట్టిగా పోరాడుతున్నారు. అటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా విశాఖకు మద్ధతుగా పోరుబాట పట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అవ్వబోతున్న తరుణంలో..ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు విశాఖ కోసం పోరాటం ఉదృతం చేశారు.

ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చెప్పి కార్యాచరణ రూపొందింస్తున్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని వైసీపీ నేతలు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇదే సమయంలో అడ్డుకుని చూడండి అని చెప్పి అమరావతి రైతులు..అటు టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనే ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు విశాఖ కోసం పోరాటం మొదలుపెట్టారు.

అలాగే విశాఖని రాజధాని కాకుండా అడ్డుకుంటుంది చంద్రబాబు అని చెప్పి ఫైర్ అవుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయిందని, విశాఖకు రాజధాని వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, దాన్ని టీడీపీ అడ్డుకుంటుందని చెప్పి మంత్రులు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే వైసీపే కాన్సెప్ట్ వచ్చి..రాజధానితో ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది పొందడంతో పాటు..ఇక్కడ టీడీపీకి చెక్ పెట్టాలని చెప్పి భావిస్తున్నారు.

పూర్తిగా రాజకీయ కోణమే కనబడుతుంది..ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులే గతంలో కూడా మంత్రులుగా చేశారు..అదే నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వచ్చి మూడేళ్లు అవుతుంది. అయినా సరే ఉత్తరాంధ్ర వెనుకబడే ఉందని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ కోణంతోనే రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పోరాటం మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల వైసీపీకి ఎంతవరకు ఉత్తరాంధ్ర ప్రజలు అండగా నిలబడతారో చెప్పలేని పరిస్తితి. కేవలం రాజధాని అంశం వల్లే ఉత్తరాంధ్రలో వైసీపీకి లబ్ది జరుగుతుందనేది కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.