ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]

ఆ సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి ప్రయత్నం…!

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి బలహీనవర్గాలంటే గిట్టేది కాదనే మాట బలంగా వినిపిస్తోంది. బీసీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్లకు అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవికావు. కనీస గౌరవం ఇచ్చే వారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించేవారు కాదు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే బలహీనవర్గాల నినాదాన్ని అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మార్పు రావడానికి కారణం ఏంటి..? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకం. ఈ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే […]

ఆ రెండు చోట్ల వైసీపీ తరఫున కొత్త నేతలు…..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతాయని ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో రాబోయే 3 నెలలు ప్రతి ఒక్కరికీ కీలకమని కూడా ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ […]

బాలినేని అలకకు కారణం అదేనా…!

ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]

బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి గారు ఫిక్స్ అయ్యారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఇంక కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందనేది నేతల మాట. ఈ నేపథ్యంలో నేతలంతా ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు ఇప్పటి నుంచే ఓటర్లు ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 50 మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం […]

చంద్రబాబు అరెస్ట్‌… టీడీపీ అనుకూలించలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు క్రమంగా మరుగున పడుతున్నట్లుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో… 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో… సుప్రీం కోర్టు గడప తొక్కారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబుకు […]

బాబు అరెస్ట్‌.. వైసీపీకి ప్లస్‌ ఆర్ మైనస్‌…?

చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు కావడంతో వైసీపీలో మంట పెరిగింది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలోని అన్ని పక్షాలతోపాటు.. జాతీయ నేతలు.. మీడియా కూడా చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకుంది. దీంతో ఏకంగా సజ్జల వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచిన వ్యవహారం […]

ఆసక్తిగా మంగళగిరి సమీకరణాలు… టీడీపీకి లాభమా… నష్టమా…!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ […]