తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వెంకటేష్ -చిరంజీవి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చాలని టాలీవుడ్ లో ఉన్న కొంతమంది పెద్దలు ప్రయత్నించారు. వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రితను చిరంజీవి కొడుకు అయినా రామ్ చరణ్ కి ఇచ్చి వివాహం చేయాలని చిరంజీవి టాలీవుడ్ పెద్దలు అనుకున్నారు. ఆ సమయంలోనే రామ్ చరణ్ తను ఉపాసనతో ప్రేమలో ఉన్నానని చెప్పడంతో వెనక్కు తగ్గారట.
తర్వాత ఈ విషయాన్ని చిరంజీవి- వెంకటేష్ కు చెప్పగా.. ఆయన కూడా రామ్ చరణ్ నిర్ణయాన్ని స్వాగతిచ్చారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా వీరిద్దరి మధ్య బంధుత్వం మొదలు కాకుండానే మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత రామ్ చరణ్ -ఉపాసన పెళ్లి చేసుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ కపుల్స్ లో ఒకరిగా ఉన్నారు. చరణ్ ఉపాసన సినిమా రంగంతో పాటు వ్యాపార రంగంలో కూడాా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి- వెంకటేష్ వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం సంబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. త్వరలోనే వెంకటేష్- చిరంజీవి కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలో టాక్ నడుస్తుంది.