గుడ్‌న్యూస్ చెప్పిన రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి..వెల్లువెత్తుతున్న విషెస్‌!

మెగా కొడ‌లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో లైఫ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్ ఉపాస‌న కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఉసాస‌న‌.. ఓవైపు భ‌ర్త‌ను, అపోలో ఆసుపత్రిని చూసుకుంటూనే మ‌రోవైపు సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.

ఇదిలా ఉంటే.. ఉప‌సాన త‌న ఫాలోవ‌ర్స్‌తో ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. తాజాగా ఉపాసన కొణిదెల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన దుబాయ్ గోల్డెన్ వీసాను సొంతం చేసుకున్నారామె. క్రిస్మస్ కానుకగా ఈ బహుమతి అందుకున్నట్లుగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

`ఈ క్రిస్మస్‌కి నాకు మంచి కానుక అందింది. యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల నాకు గౌరవం ఉంది. నేనిప్పుడు గ్లోబల్‌ సిటిజన్‌. ప్రపంచమంతా ఒకే కుటుంబం` అని ట్వీట్ చేసిన ఉప‌సాన గోల్డెన్‌ వీసా ప‌ట్టుకుని పోజు ఇచ్చిన ఫొటోను సైతం షేర్ చేసింది.

దీంతో ఉపాస‌న‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులే కాకుండా ప‌లువురు సెల‌బ్రెటీలు సైతం ఉపాస‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కాగా, దుబాయ్ ప్రభుత్వం అందించే ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్చగా నివాసం ఉండొచ్చు. మ‌రియు ఎలాంటి పర్మిషన్స్ అవ‌స‌రం లేకుండా అక్క‌డ‌ సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.

https://twitter.com/upasanakonidela/status/1475371125550944256?s=20