మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకుండానే చిరు వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టేశారు. అందులో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఒకటి. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
కొణిదెల ప్రొడక్షన్స్తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను కూడా చిరు సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం. ఈ చిత్రానికి `రారాజు` అనే టైటిల్ను కన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఈ సినిమా టైటిల్ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. అయితే ఉదయశంకర్ దర్శకత్వంలో గోపీచంద్ కూడా `రారాజు` టైటిల్తో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్తో చిరు రావడం విశేషం.