మంచు విష్ణు నటించిన తాజా మూవీ కన్నప్ప. మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్గా.. ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్ లో థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం విశేషం. కాగా.. మొదట్లో మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పుడు ఎన్నో నెగటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. మెల్లమెల్లగా సినిమాలో నటించే స్టార్ కాస్ట్ ను మంచు విష్ణు ఆడియన్స్ కు పరిచయం చేస్తూ సినిమాపై హైప్ను పెంచాడు. ఈ క్రమంలోనే సినిమా పాజిటివ్ నెలకొంది. కాగా సినిమాకు అసలు హైలెట్ ఏంటంటే ప్రభాస్.
ఈ మూవీలో రెబల్ స్టార్ నటిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్లో సినిమాపై హైప్ మొదలైంది. ఇక సినిమాల్లో ప్రభాస్ నటించిన గెస్ట్ రోల్ అయినా.. సినిమాకు ఓ రేంజ్లో బజ్ నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెరిసాడు. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ ప్రభాస్ తన నటనతో ఆకట్టుకున్నాడని.. సినిమా గ్రాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత అంతకందుకు పెరుగుతూ పోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్ రుద్ర రోల్ను ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడంటూ న్యూస్ వైరల్గా మారుతుంది. మొదట.. ఈ సినిమాలో రుద్ర పాత్ర కోసం మంచు విష్ణు.. ప్రభాస్ని కాకుండా.. మరో హీరోను భావించాడట.
ఆ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. పాన్ ఇండియా రేంజ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్.. ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉంటాడని విష్ణు భావించాడట. కానీ.. ఆ తర్వాత ప్రభాస్ను వేరే క్యారెక్టర్ కోసం విష్ణు అప్రోచ్ కాగా.. ప్రభాస్ నేను రుద్ర పాత్రలో నటిస్తానని అడగడంతో.. విష్ణు వెంటనే ప్రభాస్ రుద్ర రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా.. ఈ పాత్ర ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రభాస్ చేతికి వెళ్లిందట. ఇక ఈ మూవీలో.. ప్రభాస్ రుద్ర పాత్రలో అదరగొట్టాడని.. తన నటనతో ఆడియన్స్ను మెప్పించాడని.. ఎప్పటిలాగే పాత్రలో ఒదిగిపోయి నటించాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం.. సినిమాకు వచ్చిన ఆడియన్స్లో ప్రభాస్ ఫ్యాన్స్ సగం మంది ఉంటారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక.. ప్రస్తుతం పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న కన్నప్ప.. మొదటి రోజు ఏ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొడతాడో వేచి చూడాలి.