మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా ప్రారంభించాడు. ఇక ఇప్పటికే.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి చేశాడు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని సాహసాన్ని మొట్టమొదటిసారి చేయడానికి సిద్ధమయ్యాడు చరణ్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ లెవెల్లో అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు చరణ్ తీసుకున్న ఈ డెసిషన్ ఏ టాలీవుడ్ స్టార్ హీరో కూడా సాహసించలేదు. ప్రస్తుతం చరణ్ నిర్ణయం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ గా మారింది. అయితే.. ఇదే కాకుండా చరణ్ మరో బిగ్ ట్రీట్ ఆడియోకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నడట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు బడా ప్రాజెక్టుల చరణ్ ఆడియన్స్ను పలకరించనున్నాడని సమాచారం. ప్రజెంట్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా తర్వాత.. సుకుమార్ డైరెక్షన్లో చరణ్ సినిమా చేయనన్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా కమిట్ అయ్యాడు అంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు.. తన నెక్స్ట్ సినిమాల డైరెక్టర్ లిస్టులో లోకేష్ కనగరాజన్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఈ నలుగురితో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి, హనుమాన్తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ తో కూడా ఓ సినిమాను నటించనున్నడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. చరణ్ ఇలా ఫ్యాన్స్ కు సైలెంట్ ట్రీట్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా చరణ్ కు విషెస్ తెలియజేస్తున్నారు. తను రాబోయే సినిమాలతో మరిన్ని బ్లాక్ బస్టర్లు కొట్టాలంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలన్నింటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం చరణ్ నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టచ్ చేసే హీరో మరొకరు ఉండరు అంటూ కమెంట్లు వినిపిస్తున్నాయి.