స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్కు చెక్కేసి అక్కడ అవకాశాలను దక్కించుకుంది. అలా ఇటీవల బాలీవుడ్ కి అడుగుపెట్టిన దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక చివరిగా టాలీవుడ్ లో కొండపాలెం సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు తర్వాత మరే తెలుగు సినిమాల్లోనూ నటించలేదు.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనను ప్రభాస్ హీరోగా నటించిన ఓ సినిమా నుంచి చెప్పా పెట్టకుండా తీసేశారంటూ వెల్లడించింది. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రకుల్ మాట్లాడుతూ కెరీర్ స్టార్టింగ్లో ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందని.. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టైం లో అలాంటి అవకాశం రావడంతో ఫుల్ హ్యాపీ అయిపోయా.. నాలుగు రోజులు షూటింగ్ కూడా పూర్తయిందంటూ వెల్లడించింది. నా షెడ్యూల్ ముగియడంతో ఢిల్లీకి వెళ్ళా. చెప్పా పెట్టకుండా నన్ను సినిమాలో నుంచి తీసేశారు. తర్వాత నాకు విషయం తెలిసిందంటూ చెప్పుకొచ్చింది.
కనీసం మాటైనా చెప్పకుండా నా ప్లేస్ లో కాజల్ తీసుకున్నారు. మరో తెలుగు సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే తీసేశారు. తర్వాత నాకు ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుంది అన్న ఒ అవగాహన వచ్చిందంటూ వెల్లడించింది. ఇక మొదట్లో బాధపడినా.. తర్వాత ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని ఫిక్స్ అయ్యా అంటూ వెల్లడించింది. అయితే తనను తీసేసిన కాజల్ పెట్టిన ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. ఏ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దిల్ రాజ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు.