అలనాటి అందాల తార సౌందర్య.. చనిపోయి ఇంత కాలమైనా లక్షలాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడి విషయంలో ఇప్పటికీ ఎన్నో పాజిటివ్, నెగిటివ్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అలా గతంలో సౌందర్య చనిపోకముందు.. జగపతిబాబు, వెంకటేష్తో డేటింగ్ చేసిందని.. వీళ్ళతో ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా సౌందర్య చనిపోయిన టైంలో వెంకటేష్, జగపతిబాబు ఎంతగానో బాధపడ్డారట. ముఖ్యంగా వెంకటేష్ తో.. సౌందర్య పెళ్ళి వరకు వెళ్లిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. జగపతిబాబు, వెంకటేషే కాదు.. మరో హీరోతో సౌందర్యకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి.
ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వెంకటేష్ , జగపతి బాబు కాకుండా.. సౌందర్యకు గతంలో జె.డి.చక్రవర్తి కూడా తనను ప్రేమిస్తున్నాడు అంటూ ప్రపోజ్ చేశాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక జె.డి.చక్రవర్తి – సౌందర్య కాంబోలో ప్రేమకు వేళాయెరా, ప్రేమకు స్వాగతం సినిమాలు తర్కెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. కాగా.. ప్రేమకు వేళాయెరా సినిమా షూటింగ్ టైంలో ఆమెతో ప్రేమలో పడిన జె.డి.చక్రవర్తి.. వెంకటేష్ తో సౌందర్య ఉండగానే.. సౌందర్య దగ్గరకు వెళ్లి ఆమెను ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేశాడట. అయితే జె.డి.చక్రవర్తితో.. సౌందర్యం మాట్లాడుతూ మీపై నాకు ప్రేమ ఉంది.
కానీ.. మీరు అనుకునే విధంగా కాదు. కేవలం అభిమానంతో కూడిన ప్రేమ. హీరోగా మీరు అంటే నాకు ఇష్టం.. అంతే తప్ప పర్సనల్గా మీపై నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు.. ఇకపై ఇలాంటి ఆలోచనలు మానేసుకోండి అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అప్పట్లో సౌందర్య కోసం జె.డి చక్రవర్తి ఎన్నో కష్టాలు పడ్డారట.. తనను వలలో వేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకున్నారట. ఆమె దృష్టిలో పడటానికి.. ఆమె ప్రేమను సంపాదించుకోవడానికి ఎన్నో వేషాలు వేసాడట. కానీ.. అవేవీ వర్కౌట్ కాలేదు. చివరి వరకు జె.డి.చక్రవర్తిని ఆమె కేవలం ఓ కోస్టార్ గానే చూసిందట. అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యింది. కాగా ఇటీవల మరోసారి ఈ న్యూస్ వైరల్ అవుతుంది.