నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్లో సంగీతం తెరకెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఇండియాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్లతో ఓ సినిమా చేసేందుకు ఎవరు సాహసించలేదు. కాగా బాలయ్యకు కూడా మొదటి నుంచి ఆదిత్య 369 పై ఒక ప్రత్యేక అభిమానం ఉంది.
ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ చేయాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు. దీనిని అఫీషియల్ గా ప్రకటించారు కూడా. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆదిత్య 369 సీక్వెల్.. ఆదిత్య 999 తోనే ఉంటుందంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. కానీ బాలకృష్ణ హఠాత్తుగా మళ్లీ ఈ సినిమాను హోల్డ్ లో ఉంచారు. దానికి కారణం మరో పక్కన ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా తన కొడుకు మోక్షజ్ఞ డెబ్యు ఉండడమే. సూపర్ హీరో కాన్సెప్ట్తో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా హిట్ అయితే ప్రశాంత్ వర్మకి బాలయ్య మరో బ్లాక్ బాస్టర్ ఆఫర్ ఇవ్వనున్నాడట. అదే ఆదిత్య 999. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు బాలయ్య ప్రశాంత్ వర్మకు అప్పగించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇక ఈ విషయం గురించి ముందే ప్రశాంత్ వర్మకు కూడా ఒక మాట చెప్పి ఉంచారట.
అలాగే భైరవద్వీపం సీక్వెల్ కూడా ప్రశాంత్ వర్మతో తీయచ్చనే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. ఈ రెండు సినిమాలని మోక్షజ్ఞతో చేయడానికి బాలయ్య మొదట ప్లాన్ చేసుకున్నారు. మరి మోక్షజ్ఞ కి ప్రశాంత్ పర్మ ఇచ్చే సక్సెస్ పై మిగతా రెండు సినిమాలు ఆధారపడి ఉంటాయి. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా గడుపుతున్నారు. అలాగే హీరోయిన్ల కోసం సెర్చింగ్లో ఉన్నారట టీం. ఇక సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. రెండు, మూడు నెలలో ఈ సినిమా షూట్ ప్రారంభం కానందుని.. గతంలో బాలయ్య ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అలాగే మోక్షజ్ఞ కోసం చాలామంది డైరెక్టర్ లైన్లో ఉన్నారని బాలయ్య వివరించాడు.