నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్.. నానికి జంటగా నటించి మెప్పించింది. వివేకాత్రేయ డైరెక్షన్లో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమాతో నాని.. తారక్ దేవరను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారుతుంది. అదెలా అంటే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న.. దేవర సెప్టెంబర్ 27న మొదటి భాగం ఆల్ ఇండియా లెవెల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఇక ఐదో తేదీన నాని హీరోగా తెరకెక్కిన సరిపోద శనివారం సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. ఆ విధంగా.. నాని, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాకు పోటీ రాబోతున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇటీవల వెలువడింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న కాకుండా.. ఒకరోజు ముందు సెప్టెంబర్ 26న నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ.. 5 భాషల్లోని స్ట్రీమింగ్ కానుంది.
ఇక దేవరకు సంబంధించిన కొన్ని ప్రీమియర్ షోస్ కూడా 26వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించబడతాయి. అలా నాని.. జూనియర్ ఎన్టీఆర్కు పోటీగా రానున్నాడు అంటూ పలువురు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాని, తారక్ మంచి స్నేహితులను సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎన్నో సందర్భాల్లో పాజిటివ్గా మాట్లాడుతూ ప్రసంసలు కురిపించుకున్నసందర్భాలు ఉన్నాయి. అలాంటిది నాని, తారక్ మధ్యన కాంపిటీషన్ ఏంటి.. నాని ఓటిటి సినిమాకు.. తారక్ దేవర సినిమాకు ఎలాంటి కాంపిటీషన్ ఉండదు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.