ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఆడియన్స్ అందరి మధ్యన నడుస్తున్న ఒకే టాక్ దేవర. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ లవెల్లో బిజినెస్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్లో సందడి చేస్తున్నారు టీం. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు నెటింట వైరల్ అవుతున్నాయి.
అలా తాజాగా వైరల్ అవుతున్న ఓ విషయం నందమూరి అభిమానులను.. పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న తారక్ ఫ్యాన్స్ కు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అదే జరిగితే దేవర సినిమాకు ఈ రేంజ్ ప్రమోషన్ చాలు.. సినిమా దుమ్ము దులిపేస్తుందంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే.. సినిమా రిలీజ్కి ఇంకా ఐదు రోజులే ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో కాస్త గట్టిగానే జరుపుతున్నారు టీం. సెప్టెంబర్ 22 అంటే.. నేడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో ఘనంగా జరుగుతుంది. ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా దర్శకధీరుడు రాజమౌళి రానున్నాడని.. ఈయనతో పాటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరవుతాడు అంటూ సమాచారం.
నిజంగా అభిమానులకు ఇది బ్లాస్టింగ్ అప్డేట్ అంటే దీనికి తగ్గట్టుగానే సినిమాలోని ఓ పాటకు జూనియర్ ఎన్టీఆర్ లైవ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ పై అదరగొట్టనున్నాడంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తెగ పండుగ చేసుకుంటున్నారు. దేవర థియేటర్లలో దుమ్ము దులపడం ఖాయమంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా కళ్యాణ్, రామ్ మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.