టాలీవుడ్లో ప్రస్తుతం ఇదే న్యూస్ సంచలనం సృష్టిస్తుంది. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారని.. సీక్రెట్గా ఈ చర్చలు జరుగుతున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ప్రాజెక్ట్ను ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నాడట. పేరు రివిల్ చేయకున్నా.. కొన్ని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. పుష్పతో సంచలనం క్రియేట్ చేసిన సుకుమార్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ టాక్ వైరల్గా మారుతుంది.
ఇక వీరిద్దరి కాంబోలో ఈ మల్టీస్టారర్ను ఓ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించనున్నారని.. ప్రభాస్ను రెబల్ లీడర్ గా, ఎన్టీఆర్ ను సైబర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చూపించనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు మొదట శత్రువులుగా కలుస్తారని.. ఓ పెద్ద విలన్ తో కలిసి పోరాడే సమయంలో స్నేహితులుగా మారుతారని సమాచారం. అయితే హాలీవుడ్ స్టార్ ఒకరు సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. సినిమాలో హీరోయిన్గా.. బాలీవుడ్ టాప్ యాక్టర్స్ను రంగంలోకి దించనున్నారట.
ఇక ఈ సినిమాలో ఆమె సైంటిస్ట్ పాత్రలో మెరవనుందని.. సరికొత్త లుక్లో సర్ప్రైజ్ చేయబోతుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్తో రూపొందనుందని.. టాలీవుడ్ నుంచి గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్ నడుస్తుంది. అయితే.. ఈ సినిమా పై అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో.. కేవలం ఇది అభిమానుల ఊహాగానాలు అంటూ చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ వార్తలు మాత్రం నిజం అయితే.. ఇక తారక్, డార్లింగ్ ఫ్యాన్స్కు పూనకాలే అనడంలో సందేహం లేదు.