సీనియర్ స్టార్ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే సత్తా చాటుకుంది. అయితే.. పెళ్లయిన కొంతకాలం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన విజయశాంతి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి బిజీ బిజీగా మారిపోయింది. అలా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అంటూ పార్టీలు మారుతూ వచ్చిన ఈ అమ్మడు.. చివరిగా కాంగ్రెస్లో చేరి.. తాజాగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక సినిమాలకు దూరమైనా విజయశాంతి.. ఎట్టకేలకు అనిల్ రావిపూడి బలవంతంతో మహేష్ బాబు.. సరిలేరు నీక్కెవరు సినిమాలో కీలకపాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల్లో తన నటనకు ప్రశంసలు దక్కాయి. తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కళ్యాణ్ రామ్ తల్లిగా మెరిసింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి ఇంటర్వ్యూలో భాగంగానే బాలయ్య అన్స్టాపబుల్ షో బై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో విజయశాంతికి.. మీకు బాలయ్య అన్స్టాపబుల్ రావాలని ఆహ్వానం అందితే వెళ్తారా.. అనే ప్రశ్న ఎదురుకాగా.. దానిపై రియాక్ట్ అవుతూ నేను అలాంటి షోలకు అసలు వెళ్ళను. నాకు అలాంటి షోలకు ఎన్నోసార్లు ఆహ్వానం వచ్చింది. అయినా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వెళ్ళను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చంద్రబాబు లాంటి వారే వెళ్లారు కదా అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. వాళ్ళు చుట్టాలు వెళ్తారు. కానీ.. నాకు అలాంటి ఇష్టం ఉండదు. నేను వెళ్ళనే వెళ్ళను అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విజయశాంతి చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో వెళ్తానన్నా.. నీకు ఈ షో కి ఆహ్వానం ఉండదులే.. నీకు అంత సీన్ లేదు అంటూ బాలయ్య షోకు అసలు నీలాంటి వాళ్ళు కూడా ఆహ్వానిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.