టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మెగా ఇంటికి బుల్లి వారసుడు రాబోతున్నాడు అంటూ న్యూస్ తెగ వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య తల్లిదండ్రులు కాబోతున్నారని.. త్వరలోనే వీరు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు తెగ వైతల్గా మారుతున్నాయి. అయితే.. అది వాస్తవమే అంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ క్యూట్ కపుల్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. తను తల్లి కాబోతున్నట్లు ఈ పోస్టులో వెల్లడించింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింట వైరల్ గా మారడంతో మెగా ఫ్యామిలీతో పాటు.. అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అప్పుడే సెలబ్రేషన్స్ను సైతం మొదలుపెట్టేశారు. వెల్కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి గతంలో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో చాలా కాలం ప్రేమాయణం తర్వాత.. ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ ప్రేమ జంట ఒకటయ్యారు.
గతేడాది నవంబర్లో ఇటలీలో.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు మెగా ఫ్యామిలీ. పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీ కాగా.. లావణ్య మాత్రం చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటూ నటిస్తుంది. ఆమె పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ఆడియన్స్ను పలకరించింది. తర్వాత మరో సినిమాను ప్రకటించిందే లేదు. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య.. తన పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేయడంతో.. ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram